Saturday, April 5, 2008

ప్రాంతీయత ....!!!

ప్రజాస్వామ్యానికి ఈమద్య కాలంలో అర్దం మారుతున్నట్టుగా వుంది...కుల మత జాతి వర్ణ లింగ ప్రాంతీయ బాషా బేదాలు లేనిది నా భారతదేశం అని చెప్పటం అంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్లే...... ఇప్పటి వరకు కులాలు మతాల పేరుతో కొట్టుకున్న మనం ఇప్పుడు ఒక్క అడుగు ముందుకేశాము అదే ప్రాంతీయత.... ప్రతీచోట పని లేని, పస లేని, అధికారంలో లేని పనికిమాలిన పార్టీలకు, చోటా మోట నాయకులకు ఇది ఒక AK 47 లాంటిది... పార్టీ కార్యకర్తలు అంటూ ఒక రౌడి మూకను తయారు చేసి వాళ్ళకు బీరు, బిర్యాని ఇచ్చి ప్రాంతీయత పేరుతో అమాయకులయిన ఒక పదిమందిని కొట్టి పేపర్లో ఫొజులివ్వటం ఈమద్య కాలంలో ఒక అలవాటులా మారింది...

ఆంధ్రప్రదేశ్...

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని కలిసి పోరాడిన రోజులు చరిత్ర పుస్తకాలకు పరిమితమయ్యేలా వున్నాయి......నా తెలంగాణా కోటి రతణాల వీణ అన్న పలుకులు ప్రాంతీయత చిచ్చులో అపస్వరాలు పలుకుతున్నాయి.... కుటుంబ పెద్ద అనేవాడు ఎప్పుడు తన కుటుంబం కలిసి వుండాలి అనుకుంటాడు కాని ప్రజా కుటుంబానికి పెద్దలం అని చెప్పుకుతిరిగే ప్రజానాయకులు మాత్రం ఎప్పుడు వీల్లని విడగొడదామా అని చూస్తున్నారు....నా తెలంగాణ.... నా తెలంగాణ అని అరిచే నాయకుల కొడుకులు మాత్రం పక్క దేశంలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేయొచ్చు కాని అదే రాష్ట్రంలో పుట్టిన మనకు మాత్రం వాళ్ళ ప్రాంతంలో వ్యాపారాలు చేయకూడదు. నాకు తెలిసి టి.ఆర్.యెస్ వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం అంటుంది కేవలం ఆంధ్ర నుంచి తెలంగాణ రావటానికి, పోవటానికి కూడ ప్రత్యేక వీసాలు పెట్టాలి అని... ఎందుకంటే ఈ పార్టీలో నాయకులకు బాగా తెలిసిన వ్యాపారం దొంగ వీసాలతో పక్క దేశాలకు పంపటం...కాని కష్టంస్ వాళ్ళకు దొరికినప్పటినుంచి ఈ బిజినెస్ బాగా దెబ్బతింది దానితో ఆదాయం కూడా తగ్గింది ఇలా రాష్ట్రాన్ని విడగొడితే వీళ్ళు టాటా, బిర్లా, అంబానీలతో చాలా సులువుగా పోటీపడచ్చు.... కుటుంబంతో పాటు దొంగ వీసాలతో అమెరికా వెళ్ళాడు అని ఆరోపణలు ఉన్న ఒక అధికార పార్టీ నాయకుడు కూడా ప్రాంతీయత, ప్రత్యేక రాష్ట్రం అంటూ అరవటం చూస్తుంటే దొంగే ...దొంగా దొంగా అని అరవటంలాగ ఉంది. మొన్నటికి మొన్న తెలుగు కూడా మాట్లాడటం రాని ఒక ' తెలుగు ' హీరో తననెవరో కొట్టారన్న కారణంతో మరుసటి రోజు సింపులుగా నేను రాజకీయాలలోకి వస్తున్నానంటూ చెప్పి ప్రత్యేక తెలంగాణ కావాలి అని ఒక స్టేట్మెంట్ యిచ్చిపడేశాడు... యింకో మాజీ హీరోయిన్ పార్టీ పెట్టి ప్రజలకు కనిపించటం మానేసింది......కేవలం రెండు ఎమెల్యే సీట్లు ఉన్న బీజేపీ కూడ ప్రత్యేక రాష్ట్రం అంటుంది పాపం ఈసారి ఆ రెండు సీట్లు కూడ మిగలవని గ్రహిస్తే మంచిది.... కలిసుంటే కలదు బలం ఎదురురాదు ఏ అపజయం అన్న సంగతి గ్రహిస్తే మంచిది. ఈ ప్రాంతీయత అనే జబ్బు కేవలం ఎదో ఒక రాష్ట్రనికే పట్టలేదు మన పక్కన ఉన్న తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ఇలా దేశమంతా అంటువ్యాదిలా వేగంగా పాకుతుంది...... దీనికి ప్రజలు అనే వైద్యులు ఓటు అనే వేక్సిన్ తో చంపాలి......

ఈ నాయకులందరు ఒక్కసారి భారత రాజ్యంగంలోని ఆర్టికల్ 19 చదివితే బాగుంటుంది.... దళితులు మాకు దేవుళ్ళు అనే ఈ పార్టీలు నాయకులు కేవలం అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేయటం, పూల దండలు వేయటమేకాదు ఆయన రాసిన రాజ్యాంగాన్ని కూడా పాటించాలని తెలుసుకుంటే మంచిది...

ఆర్టికల్ 19: " ప్రతీ పౌరుడు భారతదేశంలో ఏ ప్రాంతంలో అయినా స్వేచ్చగా తిరగటానికి, నివశించటానికి అధికారం ఉంది ".

నల్ల డబ్బును అడిగే హక్కు నల్ల కోటుకు లేదు...!!!

తాజాగా ముగిసిన అసెంబ్లీ సమావేశాలలో అన్ని పార్టీలు ఒక విషయం ప్రజలకు చాలా స్పష్టంగా చెప్పాయి అదేమిటంటే "రాజకీయనాయకుల అక్రమసంపాదనను ప్రశ్నించే హక్కు ప్రజలకే కాదు ఆ న్యాయస్థానాలకు కూడా లేదు". పవిత్రమైన అసెంబ్లీలో కూర్చోని ప్రజల సొమ్మును పందికొక్కులుగా ఎవరు ఎంత తిన్నరో వారే లెక్కలు చెప్పి ఆ నల్ల డబ్బును అడిగే హక్కు నల్ల కోటుకు లేదు అని చాల సింపుల్ గా తెల్చేసారు