Saturday, September 22, 2007

కరుణానిది కి పంచె మరోసారి ఊడాలా??

తిండి ఎక్కువయి .... పని తక్కువయితే కళ్ళు నెత్తి మీదకు వస్తాయి అని పెద్దవాళ్ళు అంటూ వుంటారు .....ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రికి అదే అయినట్టు వుంది. కొన్ని కోట్ల మంది భారతీయులు మహాపురుషుడుగా భావించి అదర్శంగా తీసుకునే శ్రీరాముడి ఉనికినే ప్రశ్నిస్తున్నాడు ... ఒకసారి ఎదో తొందరలో నోరు జారాడు అనుకుని వదిలేస్తే రొజు రొజుకీ ఆయన మాటలు హిందుత్వానే ప్రశ్నిస్తున్నాయి... ఆయన ఉన్నది 70 కోట్ల మంది ఉండే హిందూ దేశంలో అని గుర్తుపెట్టుకుంటే చాలమంచిది. అధికారంలో ఉన్నప్పుడు ఒంటి బలుపుతో చేసే తప్పులకు ఆ అధికారం పోయాక పంచె ఊడేదాక కొడతారన్న సంగతి అందరికంటే ఎక్కువగా గౌరవనీయులు, ముఖ్యమంత్రివర్యులు కరుణానిది కి బాగా తెలుసు .... ఆ పరిస్థితి తెచ్చు కోవాలని ఆయనకు సరదాగా ఉన్నట్టుంది.

మొట్టమొదటిసారిగా నేను హిందువును అనే విషయం పదే పదే గుర్తుకువచ్చింది... రాముడిని, రామాయణాన్ని అవమానపరచటం అంటే భారతదేశంలోని ప్రతీ హిందువుని అవమానపరచటమే... 80 సంవత్సరాల వయసు దాటిన ఒక రాష్ట్రాదినేత కనీస విగ్నత లేకుండ మాట్లడటం చూస్తుంటే ఇది ఏదో తెలియక చేసిన వ్యాఖ్యలు అని వదిలేయలేము .... ఎక్కడో బంగ్లాదేశ్ లో పుట్టిన రచయిత్రి తస్లిమ బేగం రాసిన నవల ముస్లింలను అవమానపరిచేలా ఉంది అని ఆమెను హైదరాబాద్ లో ముస్లిం లు కొట్టారు .... 95% క్రైస్తువులు ఉండే అమెరికా వాళ్ళు జీసెస్ మీద "డా వించి కోడ్" అనే సినిమా తీస్తే అందులో కొన్ని అభ్యంతరకరమయిన సన్నివేశాలు వున్నాయని మన దేశంలో ఆ సినిమాను చాల రాష్ట్రాలలో రిలీజ్ చెయలేదు ....కొన్ని రాష్ట్రాలలో సినిమా హాళ్ళను ద్వంశం చేసారు...అలాంటి రాష్ట్రాల లిస్ట్ లో తమిళనాడు ఒకటి ... అలాంటప్పుడు కరుణానిది తలనరికితే నజరాన అని విశ్వ హిందు పరిషత్ ప్రకటించటం లో తప్పులేదనిపిస్తుంది....

పక్కవాడి నమ్మక్కాని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు .... రాజ్యంగం ప్రకారం భావ ప్రకటనా స్వేచ్చ ప్రతి ఒక్కరికి వుంది కాని పక్కవాడి కులాన్నో, మతాన్నో, సిద్దంతాన్నో పశ్నించే హక్కు ఎవడికి లేదు ఈ విషయం మన నాయకులకు తెలీకపోవటం బాధాకరం.

కరుణానిది వయసు పైన పడి అర్దంపర్దం లేకుండా మాట్లాడుతున్నట్టు వుంది....ముందు రాముడు కల్పితం అన్నాడు తర్వాత ఆయన లేడు అని చెప్పిన రాముడు తాగుబోతు అంటున్నాడు .... చూస్తువుంటే ఈయన ఎమైనా మందుకొట్టి మాట్లడుతున్నాడా అని సందేహం వస్తుంది. అయినా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న ఈయనకి ఏకపత్నీవ్రతుడు అయిన రాముడి గొప్పతనం ఎలా తెలుస్తుంది ??? తండ్రి మాట కోసం రాజ్యాని వదిలిన రాముడి గొప్పతనం అధికారం కోసం అడ్డమయిన పనులు చేసే కరుణానిదికి ఎలా తెలుస్తుంది.

Sunday, September 9, 2007

భాగ్యనగరంలో బ్రతుకు భయం

భాగ్యనగరం బాంబులతో బెంబేలెత్తిపోయింది..... మనుషులుగా పుట్టి మృగాలుగా బ్రతుకుతున్న కొంత మంది రాక్షసుల వికృత చేష్టలకు 44 మంది అమాయకులు (పిల్లలు, తల్లులు, విద్యార్దులు, ఇంకా ఎంతోమంది...) బలయిపోయారు.

ఇప్పటికయిన మన నాయకులు, రాజకీయ పార్టీలు కళ్ళు తెరవాలి....కులాలు, మతాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు మాని పార్లమెంటు మీద దాడి చేసి ఎందరో అమాయకుల ప్రాణాలు తీసిన కౄరమృగాలని వెంటనే నడిరోడ్డు మీద ఉరి తీయాలి.... చట్టం ముందు తప్పు చెసిన వాడు ఎవడైనా ఒక్కటే అన్న నిజాన్ని తీవ్రవాదులకు తెలియచేయాలి.

వందల మందిని చంపిన వాడిని శిక్షించకుండా వదిలేసినంత మాత్రాన ఆ కులం వాళ్ళో, ఆ మతం వాళ్ళో ఓట్లు వేస్తారని అనుకోవటం మన నాయకుల, పార్టీల వెర్రితనం ..... ఏ మతం, ఏ కులం తప్పు చేసినవాడిని వదిలేయమని చెప్పదు.... బాంబు పెట్టే వాడు ప్రజలను చంపాలనుకుంటున్నాడు గాని ...ఎదో ఒక కులం వాళ్ళనో, ఎదో ఒక మతం వాళ్ళనో చంపాలనుకోవటం లేదు......దీనికి సాక్షం 3 నెలల క్రితం మక్కామసీదులోను మొన్న లుంబిని పార్కు, గోకుల్ చాట్ లో జరిగిన విద్వంశం.....రెండు చోట్లా తరతమ భేదం లేకుండా, కుల మతాల ప్రస్థావన లేకుండా సామాన్యులు బలయిపోయారు.

మన ఇంటెలిజెన్సె బ్యూరోని, వచ్చే ఎలక్షన్స్ లో అధికార పక్షానికి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరు ఎంత మెజారిటీతో గెలుస్తారు అనే విషయాల కోసం కాకుండ ప్రజల శాంతి భద్రతల కోసం, తీవ్రవాదుల తోలుతీయటం కోసం ఉపయోగించే పాలకులు వచ్చేటంత వరకు ఇలాంటి సంఘటనలకు ప్రజలు బలికావలసిందే.

కాని ఒకటి మాత్రం నిజం ... ప్రాణాలు పోయాక వచ్చే ఎక్స్ గ్రేషియాలతో ప్రజలను మోసంచేయలేరు. మాజీమంత్రులకు, వాళ్ళ పిల్లలకు, పెళ్ళాలకు వందల కొద్ది సెక్యురిటీని పెట్టే ప్రభుత్వాలు ప్రజలకు కనీస భద్రత కావాలి అని గురుతు పెట్టుకుంటే మంచిది.... మేము పొయాక ఇచ్చే పైసలు ముందుగానే మా రక్షణ కోసం ముందుగానే ఖర్చుపెట్టండి.