Sunday, September 9, 2007

భాగ్యనగరంలో బ్రతుకు భయం

భాగ్యనగరం బాంబులతో బెంబేలెత్తిపోయింది..... మనుషులుగా పుట్టి మృగాలుగా బ్రతుకుతున్న కొంత మంది రాక్షసుల వికృత చేష్టలకు 44 మంది అమాయకులు (పిల్లలు, తల్లులు, విద్యార్దులు, ఇంకా ఎంతోమంది...) బలయిపోయారు.

ఇప్పటికయిన మన నాయకులు, రాజకీయ పార్టీలు కళ్ళు తెరవాలి....కులాలు, మతాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు మాని పార్లమెంటు మీద దాడి చేసి ఎందరో అమాయకుల ప్రాణాలు తీసిన కౄరమృగాలని వెంటనే నడిరోడ్డు మీద ఉరి తీయాలి.... చట్టం ముందు తప్పు చెసిన వాడు ఎవడైనా ఒక్కటే అన్న నిజాన్ని తీవ్రవాదులకు తెలియచేయాలి.

వందల మందిని చంపిన వాడిని శిక్షించకుండా వదిలేసినంత మాత్రాన ఆ కులం వాళ్ళో, ఆ మతం వాళ్ళో ఓట్లు వేస్తారని అనుకోవటం మన నాయకుల, పార్టీల వెర్రితనం ..... ఏ మతం, ఏ కులం తప్పు చేసినవాడిని వదిలేయమని చెప్పదు.... బాంబు పెట్టే వాడు ప్రజలను చంపాలనుకుంటున్నాడు గాని ...ఎదో ఒక కులం వాళ్ళనో, ఎదో ఒక మతం వాళ్ళనో చంపాలనుకోవటం లేదు......దీనికి సాక్షం 3 నెలల క్రితం మక్కామసీదులోను మొన్న లుంబిని పార్కు, గోకుల్ చాట్ లో జరిగిన విద్వంశం.....రెండు చోట్లా తరతమ భేదం లేకుండా, కుల మతాల ప్రస్థావన లేకుండా సామాన్యులు బలయిపోయారు.

మన ఇంటెలిజెన్సె బ్యూరోని, వచ్చే ఎలక్షన్స్ లో అధికార పక్షానికి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరు ఎంత మెజారిటీతో గెలుస్తారు అనే విషయాల కోసం కాకుండ ప్రజల శాంతి భద్రతల కోసం, తీవ్రవాదుల తోలుతీయటం కోసం ఉపయోగించే పాలకులు వచ్చేటంత వరకు ఇలాంటి సంఘటనలకు ప్రజలు బలికావలసిందే.

కాని ఒకటి మాత్రం నిజం ... ప్రాణాలు పోయాక వచ్చే ఎక్స్ గ్రేషియాలతో ప్రజలను మోసంచేయలేరు. మాజీమంత్రులకు, వాళ్ళ పిల్లలకు, పెళ్ళాలకు వందల కొద్ది సెక్యురిటీని పెట్టే ప్రభుత్వాలు ప్రజలకు కనీస భద్రత కావాలి అని గురుతు పెట్టుకుంటే మంచిది.... మేము పొయాక ఇచ్చే పైసలు ముందుగానే మా రక్షణ కోసం ముందుగానే ఖర్చుపెట్టండి.

1 comment:

Anonymous said...

maku anta bhayamga ledu. meeru Bhayapadalcin pani ledu. ekkado videsallo vundi Hyderabad gurinchi anavasaramga bhayapadu tunnaru. inko sari evari gurinchi i na comment chese mundu alochinci cheyandi.