Wednesday, October 10, 2007

స్వర్ణాంద్ర ముఖ్యమంత్రుల సంపాదన గంటకు కోటి...

నీ సంపదన గంటకు కోటి అంటే .... నీది కూడ కోటే కదా అనటం చూస్తుంటే .....జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందని అన్నట్టు ఉంది....వై యస్ ఆర్ గంటకు కోటి చోప్పున గడచిన 4 సంవత్సరాలలో 12 వేల కోట్లు సంపాదించాడు అని అంటున్న చంద్రబాబు నాయుడు ఈ 4 సంవత్సరాలు ఈ విషయం ప్రజలకు ఎందుకు చెప్పలేదు, ఈ రోజు ఎందుకు చెపుతున్నాడు?? అలాగే చంద్రబాబు 9 సంవత్సరాలలో 50 వేల కోట్లు సంపాదించాడు అని అంటున్న కాంగ్రేస్ వాళ్ళు ఇన్నాళ్ళు ఎందుకు నోరు విప్పలేదు......ఇదంతా దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఉంది... ఎవడు తిన్నా అది ప్రజల సొమ్మే గా ఎవడి బాబు కష్టపడ్డది కాదు....అందుకే ఇన్నాళ్ళు అటు కాంగ్రేస్ వాళ్ళు, ఇటు తెలుగుదేశం వాళ్ళు అన్నీ మూసుకుని కూర్చున్నారు....ఇప్పుడు ఓట్లు, ఓటర్లు గుర్తొచ్చి ఒకడి గుట్టు ఒకడు చెప్తున్నాడు.

ఎవడబ్బ సొమ్మని కులుకుతున్నావు అని అడిగితే సమాదనం చెప్పటానికి వీళ్ళు శ్రీ రామచంద్రులు కారు.... 10 చేతులు ఉన్న రావణాసురులు. అయినా మన రాజకీయనాయకుల ఆస్తులు, అంతస్తులు, సంపాదనలు ఎవరికి తెలియవు గనుకా ఇవ్వాళ కొత్తగా తెలుసుకోవటానికి... ఇన్ని తెలిసినా ఇంకా కులం పేరుతో నాయకులను ఎన్నుకునే సంస్క్రుతి పోనంతకాలం మన బాబులు సంపాదించిన సోమ్ము ఎవడో ఒకడు ...ఇలాంటి రావణాసురులు తింటూనే ఉంటారు....

స్వర్ణాంద్ర అంటే .....ఆంధ్రప్రదేశ్ లో ఉన్న స్వర్ణం అంతా మా నాయకులు తినేస్తారని ఇప్పుడిప్పుడే అర్దమవుతుంది

No comments: