అందరూ ఒక మంచి పని మొదలు పెట్టేటప్పుడు శుభం జరగాలని ఎలాగయితే విఘ్నేశ్వరుడ్ని ప్రార్ధిస్తారో నా ఈ కవిత కూడ అలాంటిదే...
నాయకుడ నాయకుడ నరరూప రాక్షసుడా...
మనసు గల మానవుడిగా నువ్వు మారెదెన్నడు రా...
అభయ హస్థమే చూపి అన్యాయం చేసావు
గాంధీజి శాంతి పధం గాలికి వదిలేసావు
మయి నారిటి మంత్రం తో కులమతాల చిచ్చు రేపి
వొట్ల బిక్షమెత్తి నీవు కోట్లు గడిస్తున్నావు
ఇరిగేషన్ పేరు చెప్పి ఇల్లు నింపుకున్నావు
రైతు కడుపు కొట్టి నువ్వు రాజ్యమేలుతున్నావు
పదవి కోసమే నువ్వు పాకులాడుతున్నావు
ప్రజల కష్టసుఖాలను పక్కన పెట్టావు
ప్రజాప్రతినిధిని అంటు విర్ర వీగుతున్నవు
ప్రజల నిధిని తింటు నువ్వు పైకెదుగుతు వున్నావు
రాముడిని, అయోధ్యను రాజకీయం చేసావు
మానవత్వమే మరచి ముస్లిం లను వూచకోతకోసావు
ప్రాంతీయత పేరు తోటి పవర్ లోకి వచ్చావు
నకిలి పాస్పోర్టులతో నల్ల ధనం తిన్నావు
తెలంగాణ పరువు తీసి తప్పించుకు తిరిగేవు
అభయ హస్తమునకు నువ్వు హస్తినకే పోయావు
సిగ్గు లేదు శరం లేదు చీము రక్తమసలు లేదు
ప్రాజాస్వామ్య దేశంలో జీవించే హక్కు లేదు
అన్యాయం అన్యాయం ఆపేద్దం ఈ రాజకీయం
చూపిద్దాం చూపిద్దాం నవయువ చైతన్యం
స్థాపిద్దాం స్థాపిద్దాం సమసమాజ సామ్రాజ్యం
మనం జనం , ప్రభంజనం లేదు మనకు ఏ విఘ్నం
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
చాలా చక్కగా చెప్పారు ... మీరు చివరలో చెప్పినట్టు మన కాలం వచ్చే సమయం ఆసన్నమయ్యింది. ఇక ముందుకు ఉరకటమే మిగిలింది.
Post a Comment